
గోపాల్ పేట, వెలుగు: మండలంలోని బుద్దారం ప్రైమరీ స్కూల్నుంచి 17 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలకు ఎంపికైనట్లు ఎంఈవో శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బుద్ధారం స్కూల్కు బదిలీపై టీచర్లంతా మహిళలే వచ్చారని, వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఒకే స్కూల్ నుంచి ఇంత మంది స్టూడెంట్లు ఎంపికయ్యారని చెప్పారు.
విద్యార్థులకు రాత పరీక్షలు నిర్వహించి, గురుకులానికి ఎంపికయ్యేలా తీర్చిదిద్దారని అభినందించారు. గురుకుల పాఠశాలలకు ఎంపికైన స్టూడెంట్ల తల్లిదండ్రులు స్కూల్ టీచర్లను శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. హెచ్ఎం రాజశ్రీ, టీచర్లు అనిత, నాగలక్ష్మి, సునీత, యాదమ్మ, కృష్ణ ఉన్నారు.