సెక్రటేరియెట్​లో 172 మంది ఎస్​వోల బదిలీ

సెక్రటేరియెట్​లో 172 మంది ఎస్​వోల బదిలీ

హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియెట్​లో 172 మంది సెక్షన్ ఆఫీసర్ల (ఎస్​వో)ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ శాఖల్లో దీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్న సెక్షన్‌ అధికారులను ఇతర శాఖలకు ట్రాన్స్​ఫర్ చేశారు. 

సాధారణ పరిపాలన శాఖలో 31 మంది ఎస్​ఓలు బదిలీ అయ్యారు. వీరి స్థానాల్లో ఆర్ అండ్ బీ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల నుంచి ఎస్​వోలను తీసుకున్నారు. చాలా ఏండ్ల తర్వాత భారీ స్థాయిలో ఎస్​వోలను ప్రభుత్వం బదిలీ చేసింది.