సైబర్ మోసం 1.75 లక్షలు మాయం

సైబర్ మోసం 1.75 లక్షలు మాయం

జడ్చర్ల, వెలుగు : సైబర్​ కేటుగాళ్లు మరో మోసానికి పాల్పడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  సోమవారం సాయంత్రం మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్​ గ్రామానికి చెందిన చెన్నకేశవులుకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చింది.  మీ  భార్యకు  మహాలక్ష్మి గ్రూపు లోను వచ్చింది.  బ్యాంకు  వివరాలు చెబితే మీ అకౌంట్‌‌‌‌‌‌‌‌లో డబ్బులు పడతాయని చెప్పారు. వెంటనే చెన్న  కేశవులు పక్కనే ఉన్న బూత్పూరు నివాసి మల్లేశ్ కు తన అకౌంట్ డిటైల్స్ ఇచ్చారు.

సైబర్​ మోసగాళ్లకు మల్లేశ్ అకౌంట్ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వగా​ ఫోన్​ పేలో అమౌంట్​ పంపకుండా తిరిగి అమౌంటు రిక్వెస్ట్ పెట్టారు.  గమనించని బాధితులు ‘పే నౌ ఫిన్’  నెంబర్ కొట్టగానే ఇద్దరి అకౌంట్ల నుంచి రూ. 1.75 లక్షలు కట్ అయ్యాయి.  బాధితులు జడ్చర్ల పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌‌‌‌‌‌‌‌ఐ శివానంద్ తెలిపారు.