
దుబ్బాక, వెలుగు: సింధు భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యే మాదవనేని రఘునందన్రావు సహకారంతో దుబ్బాక కేఆర్ఆర్ గార్డెన్లో శనివారం నిర్వహించిన మేగా జాబ్మేళాకు విశేష స్పందన లభించింది. వివిధ బ్యాంకులు, ఫైనాన్స్, సెక్యూరిటీ, ఐటీ సంస్థలు ప్రతినిధులు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకున్న 5,825 మంది నిరుద్యోగులను ఇంటర్వ్యూ చేసి 1758 మందిని ఎంపిక చేశారు. అనంతరం వీరికి ఎమ్మెల్యే రఘునందన్ రావుతో కలిసి అపాయింట్మెంట్ లెటర్స్ అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళా ఏర్పాటు చేశామని చెప్పారు. తాను సిద్దిపేటలో రూ. 500 జీతానికి ప్రైవేట్టీచర్గా పనిచేశానని గుర్తు చేసుకున్నారు.
ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నానంటే కష్టపడే తత్వమే కారణమని, యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. ఆయా సంస్థలు ఎక్కడ అవకాశం ఇచ్చినా వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 116 సంస్థల ప్రతినిధులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంబటి బాలేశ్ గౌడ్, కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డి, ఎంపీటీసీ పరికి రవి, నాయకులు సుభాష్ రెడ్డి, ఎస్ఎన్ చారి, చింత సంతోశ్, దూలం వెంకట్, సుంకోజి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.