రాష్ట్రంలో కొత్తగా 1,811 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 1,811 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 18 వందల 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య 2 లక్షల 10 వేలు దాటింది. గత 24 గంటల్లో 2 వేల 72 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య లక్షా 83 వేలు దాటగా..రాష్ట్రంలో ప్రస్తుతం 26 వేల 104 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న ఒక్కరోజే 9 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 12 వందల 17కు పెరిగింది. ప్రస్తుతం 21 వేల 551 మంది బాధితులు హోం ఐసోలేషన్ లో ఉన్నారు.