
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1,933 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 30 వేలకు చేరువలోకి వచ్చింది. గత 24 గంటల్లో 17,624 మందికి పరీక్షలు నిర్వహించగా… 1,933 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవారు 1,914 మంది ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో18 మందికి, విదేశాల నుంచి వచ్చినవారిలో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 29,168కి చేరింది.
1,933 #COVID19 cases reported in Andhra Pradesh in the last 24 hours. Total number of cases in the state is now at 29,168, including 13,428 active cases, 15,412 discharged & 328 deaths: State's COVID Control Room pic.twitter.com/72Zq6hi2Gj
— ANI (@ANI) July 12, 2020