
- నిజామాబాద్ జిల్లాలో 95, కామారెడ్డి జిల్లాలో 101
నిజామాబాద్ సిటీ/కామారెడ్డి టౌన్, వెలుగు : నిజామాబాద్, కామారెడ్డి కలెక్టరేట్లలో సోమవారం జరిగిన ప్రజావాణికి భూ సమస్యలు, డబుల్ బెడ్రూం ఇండ్లు, శానిటేషన్ తదితర సమస్యలపై 196 ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్లు రాజీవ్గాంధీ హనుమంతు, ఆశిష్ సంగ్వాన్లు అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
దరఖాస్తుదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. నిజామాబాద్కలెక్టరేట్లోని ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, డీపీవో శ్రీనివాస్, ఆర్డీవో రాజేంద్రకుమార్, ఏసీపీ శ్రీనివాస్, మెప్మా పీడీ రాజేందర్ పాల్గొనగా, కామారెడ్డి కలెక్టరేట్లోని ప్రజావాణిలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.