రెండోరోజు రాష్ట్రపతి భవన్లో సైన్స్ డే..

రెండోరోజు రాష్ట్రపతి భవన్లో సైన్స్ డే..

హైదరాబాద్: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో జాతీయ వైజ్ణానిక దినోత్సవ వేడుకలు రెండోరోజు జరుగుతున్నాయి. రెండో రోజు ఈ వేడుకల్లో సైన్స్ ఆవిష్కరణలు  ప్రదర్శిస్తారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రదర్శన నిర్వహిస్తారు.  

ఈ కార్యాక్రమం ద్వారా విద్యార్థులు విజ్ఞానం, సాంకేతికతో నూతన పరిణామాలు అన్వేషించుకునే అవకాశం ఉంటుంది. గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి  వివిధ పాఠశాలలు ,కళాశాలల నుండి సుమారు 2,700 మంది పాల్గొన్నారు.