శ్రీరాంసాగర్ లోకి 22వేల క్యూసెక్కుల వరద

శ్రీరాంసాగర్ లోకి 22వేల క్యూసెక్కుల వరద

బాల్కొండ, వెలుగు: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతం నుంచి గురువారం 22 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువ గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా స్వల్పంగా ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00అడుగులు(80.50 టీఎంసీలు)కాగా,గురువారం సాయంత్రానికి ప్రాజెక్టులో 1072.00 అడుగులు,(26.76 టీఎంసీలు) నిల్వ ఉందని ప్రాజెక్టు ఆఫీసర్లు తెలిపారు.

ఈ ఖరీఫ్ సీజన్ లో 20 టీఎంసీలు వరద నీరు వచ్చినట్లు పేర్కొన్నారు. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 1088.90 అడుగులు,(56.30టీఎంసీల) నీరు ఉంది.