ఏఐ ఎఫెక్ట్​!.. హైదరాబాద్​ ఐటీ కంపెనీల్లో 3 నెలల్లో 2 వేల ఉద్యోగాలు కట్​

ఏఐ ఎఫెక్ట్​!.. హైదరాబాద్​ ఐటీ కంపెనీల్లో 3 నెలల్లో 2 వేల ఉద్యోగాలు కట్​
  • కాగ్నిజెంట్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్​​ లాంటి దిగ్గజ కంపెనీల్లోనూ లే ఆఫ్స్​!
  • కరోనా టైమ్​లో భారీగా రిక్రూట్​మెంట్​
  • ఇప్పుడు ప్రాజెక్టులు లేవంటూ చేతులెత్తేస్తున్న కంపెనీలు
  • జాబ్​లకు భద్రత కల్పించాలని ఉద్యోగుల డిమాండ్​

హైదరాబాద్​, వెలుగు: ఐటీ ఉద్యోగులపై ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్ (ఏఐ)​ కత్తి వేలాడుతున్నది. హైదరాబాద్​ కేంద్రంగా ఉన్న పలు కంపెనీలు సైలెంట్​గా లే ఆఫ్స్​ ప్రకటిస్తున్నాయి. హైదరాబాద్​ ఐటీ కంపెనీల్లో 3 నెలల్లో 2 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, ఏఐ వినియోగం పెరగడం, ఖర్చులు తగ్గించుకోవాలనే భావనలో ఉన్న కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రాజెక్టులు లేవంటూ ఎంప్లాయిస్​ను పక్కకు పెడుతున్నాయి. గడిచిన 3 నెలల్లోనే హైదరాబాద్​లో 2 వేల మందికి పైగా ఉద్యోగులకు లే ఆఫ్​ ఇచ్చినట్టు తెలిసింది.  కాగ్నిజెంట్, అమెజాన్​, గూగుల్, మైక్రోసాఫ్ట్​​లాంటి దిగ్గజ టెక్​ కంపెనీలు కూడా సైలెంట్​గా ఉద్యోగులను బెంచ్​ మీద పెట్టాయి. కొవిడ్​ సమయంలో ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగులను రిక్రూట్​ చేసుకున్నాయి. అప్పుడు ఆయా కంపెనీలకు ప్రాజెక్టులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అయితే నిరుడి నుంచి పరిస్థితులు క్రమంగా మారుతూ వస్తున్నాయి. ఇక ఏఐ రాక, చాట్​జీపీటీ, డీప్​సీక్​ వంటి ఇన్నోవేషన్స్​ ఉద్యోగులను మరింత  భయపెడుతున్నాయి.  రాబోయే  ఐదేండ్లలో తమ ఉద్యోగులను పెద్దమొత్తంలో తొలగించనున్నట్టు 41 శాతం కంపెనీలు పేర్కొన్నట్టు వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎకానమిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోరమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (డబ్ల్యూఈఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఇటీవల ఒక నివేదికలో వెల్లడించింది. ప్రధాన రంగాల్లోకి ఏఐ ప్రవేశించడమే దీనికి కారణంగా వివరించింది. దీంతో ఏ క్షణం ఉద్యోగం ఊడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. దిగ్గజ ఐటీ కంపెనీలు కూడా ‘ప్రాజెక్టులు లేవు.. పనితీరు సరిగ్గా లేదు’ అంటూ వేలాది మందిని పక్కన పెడ్తుండడంతో  టెక్ ఉద్యోగులు టెన్షన్​ పడుతున్నారు.

ఏఐతో తగ్గుతున్న ప్రొడక్షన్​ కాస్ట్​..

ప్రస్తుతం ఐటీ రంగంలో ఏఐ వినియోగం పెరిగింది. హైదరాబాద్​ కేంద్రంగా పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు పనిచేస్తున్నాయి. దాదాపు 2 వేల ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.  ఐటీ ఎక్స్​పోర్ట్స్​లో రాష్ట్రమే టాప్​లో ఉన్నది. నిరుడు 2.7 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరిగాయి. ఈ కారణంగానే బెంగళూరుతో పోటీపడి హైదరాబాద్​లో ఐటీ ఉద్యోగాలు పెరిగాయి. అయితే, ఇప్పుడు అదే ఐటీ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను క్రమంగా తగ్గిస్తూ వస్తున్నాయి. సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్లు రాయాల్సిన కోడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏఐ రాసి పెడుతున్నది. దీంతో టెక్​ సంస్థలన్నీ ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ వినియోగాన్ని పెంచుతున్నాయి. తమ ప్రొడక్షన్ ​కాస్ట్​ను తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి.  ఈ నేపథ్యంలో బెంచ్ పై ఉన్న ఉద్యోగులతో బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నాయి. ఐటీ కంపెనీల్లో ఏఐ కారణంగానే చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని, రానున్న రోజుల్లో దీని వాడకం మరింత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఆర్టిఫిషియల్​ఇంటెలిజెన్స్​ అనేది  కేవలం ఐటీ కొలువులే కాకుండా బ్యాంకు ఉద్యోగాలనూ దెబ్బకొట్టనున్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. నేషనల్​, ఇంటర్నేషనల్​ బ్యాంకులు ఏఐ వినియోగాన్ని పెంచుతున్నాయి. బ్యాంకింగ్​లో మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 3 శాతం తగ్గొచ్చని బ్లూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నివేదిక తెలిపింది.  దీంతో బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మిడిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆపరేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉద్యోగాలు చేసేవారికి ముప్పు ఎక్కువగా ఉందని ఎక్స్​పర్ట్స్​ హెచ్చరిస్తున్నారు. 

ఏఐ నేర్చుకోవాల్సిందే.. ఒక పాలసీ తేవాల్సిందే

ఐటీ రంగంలో నిలదొక్కుకోవాలంటే లేటెస్ట్  టెక్నాలజీని ఎప్పటికప్పుడు నేర్చుకోవాలని, స్కిల్స్ పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏఐ, రోబోటిక్స్, మెషీన్ ​లర్నింగ్, డేటా అనలిటిక్స్ ​వంటి కోర్సులు నేర్చుకున్నోళ్లకు ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండే చాన్స్​ ఉందని చెబుతున్నారు. జావా, డాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సీ, సీ++.. ఇలా ఎన్ని ప్రోగ్రామింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ల్యాంగేజీల్లో అనుభవం ఉన్నా ఏఐలో నైపుణ్యం లేకుంటే ఉద్యోగావకాశం ఉండదని.. ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​నైపుణ్యం  కూడా ఉండాలని అంటున్నారు.  ఏఐ  వాడకం పెరుగుతుండడంతో రానున్న మూడేండ్లలో  4 వేల మంది ఉద్యోగులను తగ్గించుకుంటామని  నాస్కామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డీబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూప్ సీఈవో  పీయూష్​‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గుప్తా స్వయంగా పేర్కొన్నారు.  ఇదిలా ఉంటే ఆటోమేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌... ఈ పదం జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వణికిస్తున్నది.  ఆర్టిఫిషియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విస్తరణతో చాలా కంపెనీలు ఆటోమేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాట పట్టడంతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో ఏఐ స్కిల్స్​ ఉండటంతోపాటు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏఐ వినియోగంపై ఒక పాలసీ తీసుకురావాలని కోరుతున్నారు. అలా అయితే.. ఉద్యోగాల కోతకు పెద్దగా ఎఫెక్ట్​ ఉండదని ఐటీ ఎంప్లాయిస్​ అంటున్నారు. ఏఐ వినియోగం విషయంలో కచ్చితంగా ప్రభుత్వాలు కలుగజేసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.