భాగ్యనగరంలో బడా గణేశులు!

భాగ్యనగరంలో బడా గణేశులు!
  • ఖైరతాబాద్​లో అత్యధికంగా 70 అడుగుల మహా గణపతి
  • కొత్తపేట బాలాజీ నగర్​లో 54 అడుగుల మట్టి వినాయకుడు 
  • వనస్థలిపురం ఎన్జీఓస్​కాలనీలో 30..మూసాపేటలో 32 అడుగుల గణనాథులు

ఎల్బీనగర్/జీడిమెట్ల/కూకట్​పల్లి, వెలుగు : గ్రేటర్​సిటీలో నవరాత్రులు పూజలు అందుకునేందుకు గణనాథులు సిద్ధమయ్యారు. అత్యధికంగా ఖైరతాబాద్​లో 70 అడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎల్బీనగర్​కొత్తపేట బాలాజీనగర్​లో 54 అడుగుల్లో, మూసాపేటలో 32 అడుగుల్లో,  వనస్థలిపురం ఎన్జీఓస్​కాలనీలో 30 అడుగుల్లో, సూరారం 25 అడుగుల్లో భారీ మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించారు. వీటితోపాటు సిటీ వ్యాప్తంగా లక్షన్నర విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు భాగ్యనగర్​గణేశ్​ఉత్సవ సమితి చెప్పింది. 

మూసాపేటలో 32 అడుగుల మట్టి గణపతి

మూసాపేటలో 32 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. 60 ఏండ్ల కింద మూసాపేట పంచాయితీ వార్డు ఆఫీస్​దగ్గర మూడు అడుగుల వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఏటా ఎత్తును పెంచుకుంటూ వస్తున్నారు. గత 35 ఏండ్ల నుంచి 32 అడుగులతో వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నారు. మూసాపేట నవ యువక యువజన సంఘం ఆధ్వర్యంలో నెల రోజుల ముందు నుంచే ధూల్​పేట కళాకారులు ఈ భారీ విగ్రహ పనులు మొదలుపెట్టి పూర్తిచేశారు. శనివారం సాయంత్రం పూజలు చేసి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.