410 మంది పోలీసులకు పతకాలు...త్వరలో అందించనున్న సర్కార్​

410 మంది పోలీసులకు పతకాలు...త్వరలో అందించనున్న సర్కార్​

హైదరాబాద్‌‌, వెలుగు: విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీస్‌‌ అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం పతకాలు ప్రకటించింది. 2024 సంవత్సరానికి గాను పోలీస్ శాఖలోని వివిధి విభాగాల్లో ప్రతిభ కనబర్చిన వారిని పతకాలకు ఎంపిక చేసింది. సీనియర్ ఐపీఎస్‌‌ అధికారి స్థాయి నుంచి హోంగార్డు వరకు మొత్తం 410 మందికి ఉత్కృష్ట,అతి-ఉత్కృష్ట సేవ పతకాలు అందించనుంది.

ఇందులో అదనపు డీజీపీలు మహేశ్ భగవత్, వీవీ శ్రీనివాస్ రావు, స్వాతిలక్రాతో పాటు హైదరాబాద్ అదనపు సీపీ(ట్రాఫిక్) పి.విశ్వప్రసాద్, ఐజీ వి.సత్యనారాయణ సహా రాష్ట్రవ్యాప్తంగా 202 మంది అధికారులు, సిబ్బందికి అతి-ఉత్కృష్ట సేవా పతకం లభించింది. డీఐజీలు తఫ్సీర్ ఇక్బాల్, గజరాజ్ భూపాల్, డీసీపీ కోటిరెడ్డి సహా 208 మంది అధికారులు, సిబ్బందికి ఉత్కృష్ట సేవా పతకాలను ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే పతకాలను అందించనుంది.