తెలంగాణ‌లో భారీగా పెరుగుతున్న క‌రోనా కేసులు

తెలంగాణ‌లో భారీగా పెరుగుతున్న క‌రోనా కేసులు

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. రోజు రోజుకీ భారీ సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 269 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితిపై బుధ‌వారం రాత్రి 9 గంట‌ల‌కు బులిటెన్ విడుద‌ల చేసింది ఆరోగ్య శాఖ‌. గ‌డిచిన‌ 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 1096 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 269 మందికి పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 45,911 టెస్టులు చేయ‌గా.. మొత్తం 5,675 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు తెలిపింది. ఇవాళ ఒక‌రు క‌రోనాతో మ‌ర‌ణించ‌గా.. రాష్ట్రంలో క‌రోనా మృతుల సంఖ్య 192కు పెరిగింది. అలాగే ఇవాళ 151 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 3071కి చేరింది. ప్ర‌స్తుతం 2412 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, గ‌డిచిన 24 గంటల్లో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 214 మంది ఉన్నారని ఆరోగ్య శాఖ తెలిపింది.