ప్రేమించి పెండ్లి చేసుకోకపోవడంతో.. యువతి ఆత్మహత్య

ప్రేమించి పెండ్లి చేసుకోకపోవడంతో..  యువతి ఆత్మహత్య
  • పేట్​ బషీరాబాద్​ 
  • లేడీస్ హాస్టల్లో  ఘటన

జీడిమెట్ల, వెలుగు: ప్రేమించిన వ్యక్తి పెండ్లి చేసుకోకపోవడంతో పేట్ బషీరాబాద్​పరిధిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల్​జిల్లా ఇమాంపూర్​కు చెందిన తులసిరెడ్డి కూతురు కండెల ప్రియాంక (27) ఎంబీఏ పూర్తి చేసి సిటీలో జాబ్​చేస్తుంది. అందులో భాగంగా సుచిత్రలోని వెన్నెలగడ్డలో ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటోంది. అయితే, నగరానికి చెందిన బంకురు అప్పలనాయుడు కొడుకు రవికుమార్,  ప్రియాంక కొంతకాలంగా  ప్రేమించుకుంటున్నారు.

రవికుమార్​ ప్రేమించి పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ తర్వాత పెండ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ప్రియాంక సోమవారం ఉదయం హాస్టల్​గదిలో ఫ్యాన్​కు ఉరేసుకొని మృతి చెందింది. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఈ ఘటనపై పేట్​బషీరాబాద్​ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.