![ఇందిరమ్మ ఇళ్ల కోసమే 2,865 దరఖాస్తులు](https://static.v6velugu.com/uploads/2025/02/2865-applications-for-indiramma-houses-alone_h74WE86Jyi.jpg)
పంజాగుట్ట, వెలుగు: బేగంపేటలోని మహాత్మా జ్యోతిరావ్ ఫూలే ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 4,901 దరఖాస్తులు వచ్చినట్టు ప్రజావాణి అధికారులు తెలిపారు. వాటిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం 2,865, పౌరసరఫరాల శాఖ రేషన్ కార్డుల కోసం1640, పంచాయతీరాజ్గ్రామీణ అభివృద్ధికి 157, విద్యుత్ శాఖకు సంబంధించి 105, రెవెన్యూ సమస్యలపై 30, ఇతర శాఖలకు సంబంధించి 109 వచ్చాయి.
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి ప్రజలనుంచి దరఖాస్తులను స్వీకరించారు.