అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తున్న..3 ట్రాక్టర్లు, 3 టిప్పర్లు, 2 జేసీబీలు సీజ్​

అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తున్న..3 ట్రాక్టర్లు, 3 టిప్పర్లు, 2 జేసీబీలు సీజ్​

వికారాబాద్​, వెలుగు: వికారాబాద్ జిల్లా మోమిన్ పేట, నవాబ్ పేట పీఎస్​ల పరిధిలో అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు, మూడు టిప్పర్లు, ఎర్రమట్టి తవ్వుతున్న రెండు జేసీబీలను టాస్క్​ఫోర్స్​పోలీసులు సీజ్​చేశారు.

దేవరంపల్లి శివారులో అక్రమంగా ఎర్ర మట్టి తరలిస్తున్నారనే సమాచారంతో ఆదివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మూడు ట్రాక్టర్లు, జేసీబీని సీజ్ చేశారు. అలాగే అర్కతల శివారులో మూడు టిప్పర్లు,జేసీబీని సీజ్ చేశారు.