స్క్రాప్ కంటైనర్​లో రూ.కోటి గంజాయి

 స్క్రాప్ కంటైనర్​లో రూ.కోటి గంజాయి
  • ఏపీ నుంచి పుణెకు తరలిస్తుండగాఅబ్దుల్లాపూర్​మెట్ వద్ద పట్టివేత

దిల్ సుఖ్ నగర్, వెలుగు: స్క్రాప్​మెటీరియల్​కంటైనర్​లో గంజాయిని తరలిస్తుండగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​పోలీసులు, మహేశ్వరం ఎస్ఓటీ జోన్​పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్ ను అరెస్ట్​చేసి.. రూ.1.05 కోట్ల విలువ చేసే 300 కిలోల గంజాయిని, టాటా కంటైనర్ వెహికల్ ను సీజ్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను గురువారం కమిషనర్​సుధీర్ బాబు వెల్లడించారు. మహారాష్ట్రలోని పుణె, రూపినగర్​కు చెందిన అహ్మద్ గులాబ్ షేక్(56) డ్రైవర్ పనిచేస్తున్నాడు. అతనికి పుణెలో డ్రగ్స్ సప్లై చేసే వైభవ్, దేవాతో పరిచయం ఏర్పడింది.

ఏపీలోని విశాఖపట్నం నుంచి పూణె, ఇతర ప్రదేశాలకు గంజాయిని రవాణా చేస్తే ఒక్కో కంటైనర్ (లోడ్)కు రూ. 3 లక్షల ఇస్తామని అహ్మద్ గులాబ్ షేక్ కు వైభవ్, దేవా ఆఫర్ ఇచ్చారు. వైభవ్, దేవా సూచనల మేరకు అహ్మద్ గులాబ్ షేక్ విశాఖపట్నం వెళ్లి అక్కడ స్థానిక వ్యక్తి అయిన బుజ్జిబాబు దగ్గర నుంచి 300 కిలోల గంజాయి (138 ప్యాకెట్లు) సేకరించి హైదరాబాద్ మీదుకు పుణెకు బయలుదేరాడు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ మహేశ్వరం జోన్ పోలీసులు, అబ్దుల్లాపూర్​మెట్ పోలీసులు.. గురువారం రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర తనిఖీలు చేపట్టారు. టాటా కంటైనర్ వెహికల్ ఆపి సెర్చ్ చేయగా.. 300 కిలోల గంజాయి పట్టుబడింది. వెంటనే నిందితుడిని అధికారులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.