
సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పండుగను దృష్టిలో పెట్టుకుని 32 ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్-బ్రహ్మపుర్, బ్రహ్మపుర్-వికారాబాద్, విశాఖపట్నం-కర్నూలు సిటీ, శ్రీకాకుళం-వికారాబాద్, సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-కాకినాడ టౌన్, సికింద్రాబాద్-నర్సాపూర్ రూట్లలో ఈ రైళ్లు నడవనున్నాయి. 2024 జనవరి 7వ తేదీ నుంచి జనవరి 27 మధ్య వివిధ తేదీల్లో ఈ రైళ్లు రాకపోకలు కొనసాగించనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు అన్నింటిలోనూ ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, జనరల్ బోగీలు ఉండనున్నాయి.
ప్రత్యేక రైళ్లు ఇవే..
- సికింద్రాబాద్ నుంచి బ్రహ్మపూర్ ( ట్రైన్ నంబర్ 07089 ) – జనవరి 7, 14 తేదీల్లో
- బ్రహ్మాపూర్ నుంచి వికారాబాద్ (07090) – జనవరి 8, 15న
- వికారాబాద్ నుంచి బ్రహ్మపూర్ (07091) – జనవరి 9, 16న
- బ్రహ్మాపూర్ నుంచి సికింద్రాబాద్ (07092) – జనవరి 10, 17న
- విశాఖపట్నం నుంచి కర్నూలు సిటీ (08541) – జనవరి 10, 17, 24 తేదీల్లో
- కర్నూల్ సిటీ నుంచి విశాఖపట్నం (08542) – జనవరి 11, 18, 25 తేదీల్లో
- శ్రీకాకుళం నుంచి వికారాబాద్ (08547) – జనవరి 12, 19, 26 తేదీల్లో
- వికారాబాద్ నుంచి శ్రీకాకుళం (08548) – జనవరి 13, 20, 27 తేదీల్లో
- సికింద్రాబాద్ నుంచి తిరుపతి (02764) – జనవరి 10, 17న
- తిరుపతి నుంచి సికింద్రాబాద్ (02763) – జనవరి 11, 18న
- సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07271) – జనవరి 12న
- కాకినాడ టౌన్-సికింద్రాబాద్ (07272) – జనవరి 13న
- సికింద్రాబాద్ – బ్రహ్మపూర్ (07093) – జనవరి 8, 15న
- బ్రహ్మాపూర్ – సికింద్రాబాద్ (07094) – జనవరి 9, 16న
- నర్సాపూర్ – సికింద్రాబాద్ (07251) – జనవరి 10న
- సికింద్రాబాద్ – నర్సాపూర్ (07252) – జనవరి 11న