
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారానికి కొత్తగా మరో 38 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 572కు చేరినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఈ 38 కరోనా పాజిటీవ్ కేసుల్లో కృష్ణా – 4 , గుంటూరు -4, నెల్లూరు -6, అనంతపురం-5, చిత్తూరు-5, కడప -1 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం 572 కేసులు నమోదు కాగా 32మంది డిశ్చార్జ్ అయ్యారు. 14మంది మరణించినట్లు హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు వెల్లడించారు.