![శంషాబాద్లో 39 హోర్డింగులు తొలగింపు](https://static.v6velugu.com/uploads/2025/02/39-hordings-removed-by-hydra-in-shamshabad_NSr95QLBci.jpg)
శంషాబాద్, వెలుగు: శంషాబాద్మున్సిపాలిటీలో పర్మిషన్లేకుండా ఏర్పాటు చేసిన 39 హోర్డింగులను తొలగిస్తున్నామని, బిల్డింగ్యజమానులపైనా చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. శుక్రవారం ఉదయం శంషాబాద్లో నేషనల్హైవేకు ఇరువైపులా బిల్డింగ్స్పై ఉన్న హోర్డింగులను ఆయన పరిశీలించారు. అనంతరం హైడ్రా అధికారులు తొలగింపును ప్రారంభించారు.
హోర్డింగుల తొలగింపునకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామని రంగనాథ్తెలిపారు. అనుమతులు లేకుండా 39 ఏర్పాటు చేశారని, కొన్ని ఏజెన్సీలు ఒకదానికి పర్మిషన్తీసుకుని 3,4 ఏర్పాటు చేశాయని తెలిపారు. విచారణ అనంతరం బిల్డింగ్యజమానులపై చర్యలు తీసుకుంటామన్నారు. హైడ్రా సీఐ రవికుమార్, మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, టౌన్ ప్లానింగ్ అధికారి మనోహర్, హైడ్రా సిబ్బంది పాల్గొన్నారు.
సూరం చెరువు పరిశీలన
తుక్కుగూడ: మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ సూరం చెరువు కబ్జాకు గురవుతోందని ఫిర్యాదులు అందడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ శుక్రవారం రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో కలిసి చెరువును పరిశీలించారు. 60 ఎకరాలకు మించి ఉండాల్సిన చెరువు, కబ్జాల కారణంగా 25 ఎకరాలకు చేరిందని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. రికార్డులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని కమిషనర్వారితో చెప్పారు.