లోయలో పడ్డ బస్సు.. నలుగురు జవాన్లు మృతి

లోయలో పడ్డ బస్సు.. నలుగురు జవాన్లు మృతి

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌‌‌‌లో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. బీఎస్‌‌‌‌ఎఫ్(బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్)జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు.. బుద్గామ్‌‌‌‌ జిల్లాలోని బ్రెల్ గ్రామ సమీపంలో ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు జవాన్లు చనిపోయారు. మరో 28 మందికి గాయాలయ్యాయి.

జమ్మూ కాశ్మీర్‌‌‌‌లో జరగనున్న రెండో విడత అసెంబ్లీ ఎన్నికల్లో డ్యూటీ చేసేందుకు 36 మంది బీఎస్ఎఫ్ జవాన్లు అద్దె బస్సులో బయలుదేరారని అధికారులు తెలిపారు. బుద్గామ్‌‌‌‌ జిల్లా బ్రెల్ గ్రామ సమీపంలోని లోయలో పడిందని చెప్పారు. ప్రమాదంలో బస్సు పూర్తిగా నలిగిపోయిందన్నారు. స్థానికుల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి, గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించామని పేర్కొన్నారు.