
న్యూఢిల్లీ: గత నెల రోజులుగా డల్గా ఉన్న ఐపీఓ మార్కెట్ ఈ వారం కళకళలాడనుంది. ఈ వారం ఒక మెయిన్ బోర్డ్ ఐపీఓ, మూడు ఎస్ఎంఈ ఐపీఓలు ఇన్వెస్టర్ల ముందుకొస్తున్నాయి.
మెయిన్బోర్డ్ ఐపీఓ ఆరిస్ఇన్ఫ్రా సొల్యూషన్స్ ఈ నెల 20న ఓపెన్ కానుంది. కంపెనీ ఇంకా ఐపీఓ ధరను ప్రకటించలేదు. ఈ పబ్లిక్ ఇష్యూలో 2.86 కోట్ల ఫ్రెష్ షేర్లను అమ్మాలని చూస్తోంది.
ఎస్ఎంఈ సెగ్మెంట్లో పారాదీప్ పరివాహన్ ఐపీఓ ఈ నెల 17న ఓపెనై, 19న ముగుస్తుంది. ఈ ఇష్యూ ద్వారా రూ.44.86 కోట్లను సేకరించాలని కంపెనీ చూస్తోంది. ఒక్కో షేరుని రూ.93–98 ప్రైస్ రేంజ్లో అమ్ముతున్నారు.
డివైన్ హిరా జ్యువెలర్స్ ఐపీఓ మార్చి 17న ఓపెనై, 19 తో ముగుస్తుంది. ఒక్కో షేరు రూ.90 కి కంపెనీ అమ్మనుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.31.84 కోట్లు సేకరించాలని చూస్తోంది.
గ్రాండ్ కాంటినెంట్ హోటల్స్ ఐపీఓ మార్చి20–24 న అందుబాటులో ఉంటుంది. ఒక్కో షేరుని రూ.107–113 ప్రైస్ రేంజ్లో విక్రయిస్తున్నారు. ఈ ఇష్యూ ద్వారా రూ.74.46 కోట్లు సేకరించాలని కంపెనీ చూస్తోంది.
వీటితో పాటు రెండు కంపెనీల లిస్టింగ్స్ ఉన్నాయి. పీడీపీ షిప్పింగ్ షేర్లు బీఎస్ఈ ఎస్ఎంఈలో మార్చి 18 న లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది. సూపర్ ఐరన్ ఫౌండరీ బీఎస్ఈ ఎస్ఎంఈ సెగ్మెంట్లో మార్చి 19 న లిస్టింగ్ అవ్వనుంది.