
వేములవాడ, వెలుగు: డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన 91మందికి వేములవాడ జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జ్యోతిర్మయి జైలు శిక్ష, జరిమానా విధించినట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు.
14 రోజులుగా జరిపిన వాహనాల తనిఖీల్లో మందు తాగి పట్టుబడిన వారిని శనివారం కోర్టులో ప్రవేశపెట్టామని, వీరిలో ఇద్దరికి 7 రోజులు జైలు శిక్ష, ఏడుగురికి 3 రోజులు జైలు శిక్ష, ఐదుగురికి 5 రోజులు జైలు శిక్ష, 27 మందికి 2 రోజుల జైలు శిక్ష, 50 మందికి జరిమానా విధించారని సీఐ తెలిపారు.