ఎండలకు 36 గంటల్లోనే 45 మంది మృతి

ఎండలకు 36 గంటల్లోనే 45 మంది మృతి

వడగాడ్పులతో దేశవ్యాప్తంగా గత 36 గంటల్లో 45 మంది మృతి చెందారు. ఒడిశాలో 19 మంది, ఉత్తరప్రదేశ్ లో 16 మంది, బిహార్​లో ఐదుగురు, రాజస్థాన్ లో నలుగురు, పంజాబ్ లో ఒకరు మృతి చెందారు. వడదెబ్బతో చనిపోయిన వారిలో 25 మంది వరకు ఎన్నికల సిబ్బందే ఉన్నట్టు తెలిసింది. గత కొన్ని రోజులుగా వడగాడ్పులతో చనిపోయిన వారి సంఖ్య 87కు చేరింది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో తీవ్ర నుంచి అతి తీవ్ర వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత కాన్పూర్ లో 48.2 డిగ్రీలుగా నమోదైంది.