478 మంది తాగి దొరికిన్రు

 478 మంది తాగి దొరికిన్రు
  • 388 మంది బైకర్లే..

గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 16 ట్రాఫిక్ పీఎస్​ల​లిమిట్స్​లో శనివారం డ్రంక్​అండ్​డ్రైవ్​ తనిఖీలు చేపట్టారు. ఇందులో 478 మంది తాగి బండ్లు నడుపుతూ పోలీసులకు చిక్కారు. వీరిలో 388 మంది బైకర్లు, 70 మంది కారు డ్రైవర్లు ఉన్నారు. ఇందులో అత్యధికంగా మియాపూర్​పీఎస్ పరిధిలో101 మంది, అత్యల్పంగా రాయదుర్గం, మేడ్చల్ ​లో 15 మంది దొరికారు. 187 మంది 31 నుంచి 40 ఏండ్ల వయస్సు మధ్య ఉండగా, 172 మంది 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.