పాల్వంచలో 5 కిలోల గంజాయి పట్టివేత

 పాల్వంచలో 5 కిలోల గంజాయి పట్టివేత

పాల్వంచ, వెలుగు : పట్టణంలోని నవభారత్ వద్ద బైక్​పై ఆంధ్ర, ఒరిస్సా బార్డర్ నుంచి గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని ఖమ్మం ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ సుంకరి రమేశ్​ఆధ్వర్యంలో సోమవారం పట్టుకున్నా రు. వారి నుంచి 5 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసు కొని  సాయి తేజ, కె వివేక్ రెడ్డి ని  అరెస్ట్​ చేసి,  కోర్టులో హాజరుపరిచారు. ఈ గంజాయి విలువ 2 లక్షలు ఉంటుందని సీఐ రమేశ్​తెలిపారు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ కరీం, కానిస్టేబుల్స్ సుధీర్, వెంకటేశ్​ , విజయ్, హనుమంతరావు, ఉపేందర్ పాల్గొన్నా రు.