
శివుడు సులభంగా సంతోషిస్తాడని, అతని అంచనాలో శివ మంత్రాన్ని పఠించడం వల్ల మీ జీవితంలో సానుకూలత లభిస్తుందని చెబుతారు. భక్తులు పఠించగలిగే శివ మంత్రాలు టన్నుల కొద్దీ ఉన్నాయి. సృష్టిలో ప్రతి ప్రాణికి పంచభూతాలే జీవనాధారం. అంతటా నిండి ఉండే శివుడు ఆ పంచభూతాలు సైతం తానే అంటున్నాడు. ఆయనే జలం, తేజం, వాయువు ఆయనే ఆకాశం, ఆయనే భూమండలం. పంచభూతాత్మక స్వరూపుడైన పరమశివుడు లింగ స్వరూపుడు శివుడు. అయితే శివుడిని ఆరాధించేందుకు శక్తివంతమైన ఐదు మంత్రాలున్నాయి. ఆ మంత్రాలకు ఎంతో శక్తి ఉందని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ మంత్రాలు.. వాటి అర్దాన్ని విపులంగా తెలుసుకుందాం .. .
మొదటి మంత్రం: ఓం నమః శివాయ
అర్దం : నేను శివుడికి నమస్కరిస్తున్నాను. నమః శివాయ అనేది శివుని పంచ బోధ తత్వంతో ఐదు అంశాలతో కూడిన అతని సార్వత్రిక ఏకత్వంగా పరిగణించబడుతుంది.
వివరణ: ఓం నమః-శివాయ అనేది పంచాక్షరి మంత్రం . అంటే ఐదు అక్షరాలు కలిగినది. కేవలం ఐదు అక్షరాల మహత్తర కలయిక అయిన ఈ మంత్రం అసాధారణమైన ఫలితాలను ఇస్తుంది. చూసుకుంటే, చరిత్రలో అతి ఎక్కువ మంది బహుశా ఈ పంచాక్షర మంత్రంతోనే తమ పరమోన్నతమైన స్థాయికి చేరుకున్నారేమో. ఈ పంచాక్షరాలు ప్రకృతిలోని పంచభూతాలను కూడా సూచిస్తాయి.
న అంటే భూమి,
మ అంటే నీరు,
‘శి’ అంటే అగ్ని,
‘వ’ అంటే వాయువు, ‘
య’ అంటే ఆకాశం.
ఈ పంచాక్షరాలపై పట్టు సాధిస్తే, అప్పుడు అవి పంచభూతాలతో తయారైన అన్నింటిని మీ చైతన్యంలో లయం చేస్తాయని పండితులు చెబుతున్నారు.
రెండవ మంత్రం: ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్"
అర్దం : దీనికి అర్థం అందరికి శక్తిని ఇచ్చే ముక్కంటి దేవుడు, సుగంధ పరిమళం కలిగి, పుష్టిని వృద్ధి చేసే, మూడు కన్నుల పరమేశ్వరా ! నిన్ను పూజిస్తున్నాను. తొడిమ నుండి దోసపండును ఎలా వేరుచేస్తున్నావో అలాగే మృత్యువు నుంచినన్ను వేరుచేయుము. అమృత సమానమైనమోక్షము నుండి నేను విడివడకుండ ఉండును గాక.
వివరణ మృత్యంజయ మంత్రము లేదా మహామృత్యుంజయ మంత్రము ఋగ్వేదం (7.59.12) లోని ఒక మంత్రము. ఇది ఋగ్వేదంలో 7వ మండలం, 59 వ సూత్రంలో 12 వ మంత్రంగా వస్తుంది. దీనినే "త్య్రంబక మంత్రము", "రుద్ర మంత్రము", "మృత సంజీవని మంత్రము" అని కూడా అంటారు. ఇదే మంత్రం యజుర్వేదం (1.8.6.i; 3.60) లో కూడా ఉన్నది. ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి, మోక్షం కొరకు జపిస్తారు. గాయత్రీ మంత్రములాగానే ఇది కూడా హిందూ మతములో ఒక సుప్రసిద్ధమైన మంత్రము. .
మూడవ మంత్రం: ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి |
తన్నో రుద్రః ప్రచోదయాత్
అర్దం నాకు బుద్ధిని మరియు జ్ఞానాన్ని ప్రసాదించమని అడగడం.. అంతేకాక నా హృదయాన్ని శాశ్వతమైన కాంతితో ప్రకాశింపజేసే శక్తిని కలుగజేయాలని దీని అర్దం
వివరణ: పుణ్యపాప ఫలితాలే జీవిత సుఖదుఖాలని పండితులు అంటున్నారు. వారు వారు చేసిన పాప ఫలితాలు అనుభవించక తప్పదు. అయితే పాప ఫలితాల నుంచి విముక్తి పొందాలంటే శివనామస్మరణ చేయడం ఉత్తమం. శివ పరమాత్మను మనసారా ధ్యానించి..ఆయనను ప్రతిరోజూ పూజించే వారికి పుణ్యఫలాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.
నాల్గవ మంత్రం కర్పూర్ గౌరం కరుణావతారం,
సంసారసారం భుజగేంద్రహారం;
సదావసంతం హృదయారవిందే,
భవం భవానీసహితం నమామి
అర్దం : కర్పూరం వంటి తెల్లని వాడు, కరుణా స్వరూపుడు; పామును మెడలో హారంగా ధరించి ప్రపంచ ఉనికిని, సారాంశాన్ని తెలియజెప్పిన మహానుభావుడైన శివ పరమాత్ముడు ఎల్లప్పుడూ నా హృదయంలో నివసించే శివపార్వతులకు నేను నమస్కరిస్తున్నాను.
వివరణ: పరమేశ్వరుడు కూడా అలంకార ప్రియుడే. ధ్యానంలో ఓసారి, దిగంబరంగా మరోసారి, లింగరూపంలో ఇంకోసారి కనిపించే పరమేశ్వరుడు...గౌరీపతిగా, సర్వాలంకార భూషితుడిగా పూజలందుకుంటాడు. దీన్నే వామదేవం అంటారు. మిగిలిన రూపాల్లో కనిపించని విధంగా శివుడు అలంకారాలతో, పక్కన అమ్మవారు, విఘ్ననాధుడు, కుమారస్వామి, నంది తో కన్నులపండువగా కనిపిస్తాడు. సుఖ, సంతోషాలు, భోగభాగ్యాలు, సత్సంతానంతో తులతూగాలని మానవాళిని ఆశీర్వదించే రూపం ఇది. ఆలయాల్లో మినహా ఇంట్లో ఎక్కువగా పూజించేది ఈ రూపాన్నే. ఈశాన్యం ముఖంలో కనిపించే పరమేశ్వరుడు అత్యంత ప్రియభక్తులను మాత్రమే అనుగ్రహిస్తాడట.
ఐదవ మంత్రం : కర్చరాంకృతం వా కాయజం కర్మజం వా
శ్రవన్నయనజం వా మానసం వా
పరధాం విహితం విహితం వా
సర్వ మేతత క్షమస్వ జయ జయ కరుణాబ్ధే శ్రీ మహదేవ్ శంభో'
అర్దం : శరీరం, మనస్సు మరియు ఆత్మను అన్ని ఒత్తిడి, తిరస్కరణ, వైఫల్యం, నిరాశ మరియు ఇతర ప్రతికూల శక్తుల నుండి శుభ్రపరచడానికి సర్వోన్నతుడిని ఆరాధించడం
వివరణ : మీరు శివుడిని ధ్యానించాలని చూస్తున్నట్లయితే, శివ ధ్యాన మంత్రం మీ కోసం. ఈ మంత్రం ఈ జీవితంలో లేదా గతంలో మనం చేసిన అన్ని పాపాలకు భగవంతుని నుండి క్షమాపణను కనుగొనడానికి ప్రయత్నిస్తుంది, అందువలన, మీరు మీ జీవితంలో మీ ఆత్మ మరియు ప్రతికూలతను శుద్ధి చేయాలనుకుంటే ఈ మంత్రం కూడా ప్రభావవంతంగా ఉంటుంది.
దేవుళ్లంతా నిత్య అంలంకరణలో కనిపిస్తారు. మరి శివుడెందుకు కనిపించడనే సందేహం వస్తుంది. అయితే శివుడు కూడా సర్వాలంకార భూషితుడే. కానీ ఒక్కో రూపంలో ఒక్కోలా కనిపిస్తాడు. ఓ రూపంలో దేవతలను అనుగ్రహిస్తే...మరో రూపంలో అఘోరాలతో పూజలందుకుంటాడు....ఇంకో రూపంలో యోగులను కరుణిస్తే....నాలుగో రూపంలో కన్నుల పండువగా కనిపిస్తూ మానవాళిని ఉద్ధరిస్తాడని పురాణాల్లో ఉందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.