
- బీటెక్, డిగ్రీ, ఫార్మా స్టూడెంట్లతో కిక్కిరిసిన జేఎన్టీయూ క్యాంపస్
కూకట్పల్లి, వెలుగు: హైదరాబాద్ కూకట్పల్లిలోని జేఎన్టీయూలో నిపుణ, సేవ ఇంటర్నేషనల్సహకారంతో శనివారం నిర్వహించిన మెగా జాబ్ఫెయిర్కు విశేష స్పందన లభించింది. తెలంగాణ, ఏపీ నుంచి 50 వేల మందికి పైగా బీటెక్, డిగ్రీ, ఫార్మా స్టూడెంట్లు తరలిరావడంతో క్యాంపస్ కిక్కిరిసింది. అర కిలోమీటర్మేర క్యూ లైన్లు కనిపించాయి. ఈ క్రమంలో స్వల్ప తోపులాట జరిగింది. వర్సిటీ యాజమాన్యం తాగునీరు, టెంట్లు వంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో నిరుద్యోగులు అంతా మధ్యాహ్నం వరకు ఎండలోనే నిలబడ్డారు. కొందరు చెట్ల కింద వేచి చూశారు.
100కు పైగా కంపెనీలు 20 వేల ఉద్యోగాలు కల్పిస్తాయని ప్రకటనలు ఇవ్వడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నిరుద్యోగులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వీరిలో అమ్మాయిలు కూడా ఎక్కువ మందే ఉన్నారు. 20కు పైగా ఐటీ, నాన్ఐటీ కంపెనీలు, 10కి పైగా ఫార్మా, 30కు పైగా కోర్ఇంజినీరింగ్, 40కు పైగా బ్యాంకింగ్, రిటైల్, మేనేజ్మెంట్ కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. మొత్తం 52, 243 మంది నిరుద్యోగులు హాజరుకాగా, 3,618 మందికి ఉద్యోగాలు లభించాయని వర్సిటీ యాజమాన్యం ప్రకటించింది. 9,681 మందిని ఆయా కంపెనీలు షార్ట్లిస్ట్చేశాయని, మరో 2 వేల మందిని కూడా షార్ట్లిస్ట్చేసే చాన్స్ఉందని చెప్పింది. ఈ జాబ్ఫెయిర్ను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, జేఎన్టీయూ వీసీ కిషన్కుమార్రెడ్డి ప్రారంభించారు. వర్సిటీ రెక్టార్విజయ్కుమార్రెడ్డి, రిజిస్ట్రార్ వెంకటేశ్వర్రావు, ఇండస్ట్రీ ఇంటరాక్షన్ డైరెక్టర్ రజిని, డిప్యూటీ డైరెక్టర్ సురేష్కుమార్పాల్గొన్నారు.