ఆ గ్రామంలో 53 మందికి కరోనా.. లాక్డౌన్ విధించుకున్నారు

ఆ గ్రామంలో 53 మందికి కరోనా.. లాక్డౌన్ విధించుకున్నారు

కరీంనగర్: కరోనా రెండో దశ కోరలు చాస్తోంది. ఒక చిన్న గ్రామంలో ఒకేసారి 53 మందికి సోకినట్లు నిర్ధారణ కావడం కలకలం రేపింది. గ్రామస్తుల్లోని ఆందోళనను గుర్తించిన పెద్దలు, సర్పంచ్ కలసి తమకు తాము లాక్డౌన్ విధించుకున్నారు. చొప్పదండి మండలం పెద్దకురుమపల్లి గ్రామస్తుల నిర్ణయం పరిసర ప్రాంతాల్లో చర్చనీయాంశం అయింది. ఒకేసారి 53 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్తగా పెద్ద కురుమపల్లె గ్రామంలో లాక్డౌన్ విధించినట్లు సర్పంచ్ గంగమల్లయ్య మీడియాకు వెల్లడించారు.