కామారెడ్డి ప్రజావాణిలో 58 ఫిర్యాదులు

కామారెడ్డి ప్రజావాణిలో 58  ఫిర్యాదులు

కామారెడ్డిటౌన్​, వెలుగు : కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో  58 ఫిర్యాదులు రాగా, కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్, అడిషనల్​ కలెక్టర్ విక్టర్ ఫిర్యాదుదారులతో మాట్లాడా వివరాలను సేకరించారు.  జిల్లా, మండల అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు.  

ఎల్​ఆర్​ఎస్​, ధరణి సమస్యలపై తహసీల్దారులు,  ప్రాపర్టీ టాక్స్​,  శానిటేషన్​, నర్సరీలు, మొక్కల పెంపకంపై ఎంపీడీవో లు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పత్రికల్లో వచ్చే ప్రతికూల వార్తలకు సంబంధిత అధికారులు స్పందించాలని తెలిపారు.