హైదరాబాద్‌‌లో ఎస్‌‌ఎఫ్‌‌ఏ ఛాంపియన్‌‌షిప్‌ ఐదో ఎడిషన్

హైదరాబాద్‌‌లో ఎస్‌‌ఎఫ్‌‌ఏ ఛాంపియన్‌‌షిప్‌ ఐదో ఎడిషన్

హైదరాబాద్‌‌: ఐదో ఎడిషన్​ఎస్‌‌ఎఫ్‌‌ఏ(స్పోర్ట్స్‌‌ ఫర్‌‌ ఆల్‌‌) ఛాంపియన్‌‌షిప్‌‌కు హైదరాబాద్‌‌ వేదిక కానుంది. ఈ ఏడాది నాలుగు నెలల వ్యవధిలో మొత్తం 10 ఎస్‌‌ఎఫ్‌‌ఏ ఛాంపియన్‌‌షిప్‌‌ ‌లు జరుపుతామని నిర్వాహకులు ప్రకటించారు. వీటి ద్వారా 2 లక్షల మంది అథ్లెట్లకు 3,040  క్రీడాంశాల్లో పోటీపడే అవకాశం కల్పించనున్నారు. ఫలితంగా ఇండియాలో స్పోర్ట్స్‌‌లో నంబర్‌‌వన్‌‌గా ఉండే స్కూల్‌‌ను ఎంపిక చేయనున్నారు.

స్పోర్ట్స్​అథారిటీ ఆఫ్ ఇండియాతో(సాయ్‌‌)తో భాగస్వామ్యంలో ఉన్న ఎస్‌‌ఎఫ్‌‌ఏ 2028 వరకు జరిగే ఖేలో యూత్‌‌ గేమ్స్‌‌కు స్పాన్సర్‌‌గా వ్యవహరించనుంది. 2015లో మొదలుపెట్టిన ఈ మల్టీ స్పోర్ట్‌‌ స్కూల్‌‌ కాంపిటీషన్‌‌ ప్లాట్‌‌ఫారమ్‌‌.. వచ్చే ఐదేళ్లలో 50 నగరాల్లో 150 చాంపియన్‌‌షిప్స్‌‌ నిర్వహించేందుకు రెడీ అవుతోంది.