నిజామాబాద్ జిల్లాలో ఆపరేషన్​ స్మైల్​లో 60 మంది పిల్లలకు విముక్తి

నిజామాబాద్ జిల్లాలో ఆపరేషన్​ స్మైల్​లో 60 మంది పిల్లలకు విముక్తి

నిజామాబాద్, వెలుగు: జిల్లా కమిషనరేట్ ​పరిధిలో నిర్వహించిన ఆపరేషన్​స్మైల్​లో 60 మంది పిల్లలను గుర్తించామని ఇన్​చార్జి ​సీపీ సింధూశర్మ తెలిపారు. శనివారం ఆమె మీడియాకు ప్రకటన రిలీజ్​ చేశారు. ఇందులో బాలకార్మికులుగా పనిచేస్తున్న వారు, పేరెంట్స్​ నుంచి తప్పిపోయిన 18 ఏండ్లలోపు పిల్లలు ఉన్నారన్నారు.

తల్లిదండ్రులకు కౌన్సెలింగ్​ఇచ్చి కొందరు పిల్లలను వారి వద్దకు చేర్చామని, మిగతా కొందరి పేరెంట్స్​ను చేరుకోడానికి దర్పన్​యాప్​లో పిల్లల వివరాలు పెట్టామన్నారు. అప్పటి వరకు వారు చైల్డ్​ వెల్ఫేర్​ఆఫీసర్ల సంరక్షణలో ఉండేలా అప్పగించామన్నారు. పిల్లలను పనిలో నియమించుకోవద్దనే చట్టాన్ని ఉల్లఘించిన ఇద్దరిపై కేసులు నమోదు చేశామన్నారు.