ప్రజావాణికి 606 ఫిర్యాదులు

ప్రజావాణికి  606 ఫిర్యాదులు

పంజాగుట్ట​,వెలుగు:  మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్​లో మంగళవారం జరిగిన ప్రజావాణికి మొత్తం 606 ఫిర్యాదులు వచ్చినట్టు అధికారులు తెలిపారు.  రెవెన్యూకు 108, పౌరసరఫరాలకు 106, విద్యుత్​ శాఖకు 64, హౌజింగ్​కు 115, మైనారిటీ సంక్షేమం 38, ఇతర శాఖలకు సంబంధించి175 ఫిర్యాదులు వచ్చాయి. అహ్మద్​గూడకు చెందిన డబుల్​ బెడ్రూమ్ లబ్ధిదారులు ఇండ్లు ఇచ్చినా విద్యుత్​, తాగునీటి సౌకర్యం కల్పించలేదని బైఠాయించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, నోడల్​అధికారి దివ్య దేవరాజన్​  ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.