రేషన్ ​కార్డుల కోసం 6.23 లక్షల అప్లికేషన్లు : సీఆర్ఓ ఫణీందర్​రెడ్డి

రేషన్ ​కార్డుల కోసం 6.23 లక్షల అప్లికేషన్లు : సీఆర్ఓ ఫణీందర్​రెడ్డి
  • సీఆర్ఓ ఫణీందర్​రెడ్డి

హైదరాబాద్​సిటీ, వెలుగు: రేషన్​కార్డుల కోసం మొత్తం 6.23 లక్షల మంది అప్లై చేసుకున్నారని, ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించే వార్డు సభల్లో అర్హుల జాబితా చదివి వినిపిస్తామని చీఫ్​రేషనింగ్​ఆఫీసర్(సీఆర్ఓ) ఫణీందర్​రెడ్డి తెలిపారు. కార్డులు రానివారు, లేనివారు అక్కడే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 

కాంగ్రెస్​సర్కారు ఏర్పడే నాటికి సిటీ పరిధిలోని 9 సర్కిళ్లలో 43 వేల మంది దరఖాస్తు చేసుకోగా, గ్రేటర్​పరిధిలోని మరో 40 వేలతో కలిపి 83వేల మంది రేషన్​కార్డులు లేనివారిని గుర్తించామన్నారు. ప్రజా పాలన, కులగణన సర్వేలో మరో 5.40 లక్షల మంది అప్లై చేసుకున్నట్లు తెలిపారు. త్వరలో బల్దియా అధికారులతో కలిసి దరఖాస్తుదారుల ఇండ్లకు వెళ్లి పరిశీలించి అర్హులను గుర్తిస్తామన్నారు. ఆ జాబితానే వార్డు సభల్లో ప్రకటిస్తామన్నారు.