ఏపీలో పెరిగిపోతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీలో పెరిగిపోతున్న కరోనా పాజిటివ్‌ కేసులు
  • 24 గంటల్లో 67 కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో 67 మందికి పాజిటివ్‌ వచ్చిందని అధికారులు బులిటెన్‌ రిలీజ్‌ చేశారు. దీంతో మంగళవారానికి మొత్తం కేసుల సంఖ్య 1717కు చేరింది. 8,263 మందికి టెస్టులు చేయగా.. 67 మందికి పాజిటివ్‌ వచ్చిందని అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 34కు చేరింది. 589 మంది డిశ్చార్జ్‌ కాగా.. 1094 మంది ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. గడిచిన 24 గంటల్లో చిత్తూరు, తూర్పు గోదావరి, ప్రకాశం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్క పాజిటివ్‌ కేసు నమోదు కాలేదు. కాగా.. కర్నూలు జిల్లాలో కేసులు 516కు చేరుకోగా, గుంటూరులో 351 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో కృష్ణా జిల్లాలో 286 కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు.

జిల్లాల వారీగా వివరాలు