గ్రూప్1 ‘హిస్టరీ’  ఎగ్జామ్​కు 68% అటెండ్

గ్రూప్1 ‘హిస్టరీ’  ఎగ్జామ్​కు 68% అటెండ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జరుగుతున్న గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ మూడోరోజూ ప్రశాంతంగా ముగిశాయి. మంగళవారం జరిగిన ‘హిస్టరీ, జాగ్రఫీ, కల్చర్’ పరీక్షకు 31,403 మందికి గాను 21,429 (68.2%) మంది హాజరయ్యారని టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. ఈ పరీక్షలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, మిషన్ కాకతీయ, సమ్మక్క సారలమ్మ జాతర, హైదరాబాద్ రాజ్యంలో దళిత ఉద్యమం, ఆరు, ఏడో నిజాం కాలంలో అభివృద్ధి, హైదరాబాద్​లో ప్రజారవాణ వ్యవస్థ, గోల్కొండ రాజ్యంలో కుతుబ్ షాహీల పాలన, 1857 తిరుబాటు తర్వాత బ్రిటీష్ పాలనలో మార్పు వంటి తదితర అంశాలపై క్వశ్చన్లు వచ్చాయి.