తాండూరులో 7 లక్షల ఫేక్ కరెన్సీ సీజ్

తాండూరులో 7 లక్షల ఫేక్ కరెన్సీ సీజ్

ఫేక్ కరెన్సీ నోట్ల ముఠాను గుట్టురట్టు చేశారు వికారాబాద్ జిల్లా పోలీసులు. తాండూరులోని 7 లక్షల ఫేక్ కరెన్సీని సీజ్ చేశారు. కంప్యూటర్  సహా..నోట్ల ప్రింటర్, ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 19న తాండూరు రైల్వే స్టేషన్ లో అనుమానంతో తిరుగుతున్న చంద్రయ్య అనే వ్యక్తిని పట్టుకొని విచారించగా.. అసలు విషయం తెలిసింది. 

తెలంగాణ, ఆంధ్రాలో నకిలీనోట్లు తయారు చేసి.. మార్కెట్లో సర్క్యులేట్ చేస్తున్నట్లు తెలిపారు. నకిలీ నోట్ల ముఠా సభ్యుల్లో కొంత మందికి నేరచరిత్ర ఉందని ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు.