ఓ రారి..! అది బైక్ రా నాయనా.. బస్సు కాదు

ఓ రారి..! అది బైక్ రా నాయనా.. బస్సు కాదు

ఉత్తరప్రదేశ్: అది బైక్ హ? మినీ బస్సా? డ్రైవర్ ఏం అని అనుకున్నాడో తెలియదు కానీ.. అతను చేసిన పని పెద్ద సాహసం అనే చెప్పాలి. ఒక బైక్ పై ఏకంగా ముగ్గురు కాదు, ఐదుగురు కాదు ఏకంగా ఏడుగురిని ఎక్కించుకున్నాడు ఓ బైకర్. ఈ విన్యాసం ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో జరిగింది. ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించిన ఆ రైడర్ ను ఎవరో వీడియో రికార్డ్ చేశారు. 

దీంతో అది కొద్దీ టైంలోనే సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టి ఫుల్ వైరల్ గా మారింది. బైక్ వెనుక సీటుపై వెనుక ముగ్గురు కూర్చున్నారు. బైక్ ట్యాంక్ పై ఇద్దరు పిల్లలు, డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి భూజాలపై మరో చిన్నారి కూర్చుంది. ఒక్క డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి తప్పా మిగిలిన వారంతా చిన్న పిల్లలే.. ఆ వీడియో ట్రాఫిక్ పోలీసులు కంటబడింది. దీంతో ఆ బైక్ కు హాపూర్ పోలీసులు రూ.9 వేల 500 ఫైన్ వేశారు. ఈ విషయాన్ని అవేర్‌నెస్ కోసం హాపూర్ పోలీసులు ఎక్స్ లో పోస్ట్ చేశారు. గతంలో కూడా అక్కడ ఇలానే ఒకే బైక్ పై ఏడుగురు ప్రయాణిస్తే ట్రాఫిక్ పోలీసులు రూ.22 వేలు ఛాలన్ విధించారు.