గోనె సంచిలో బాలిక మృతదేహం..ఏం జరిగింది.?

గోనె సంచిలో బాలిక మృతదేహం..ఏం జరిగింది.?

కుత్బుల్లాపూర్  మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది.  గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ బాసరగడి గ్రామంలో గోనె సంచిలో బాలిక మృతదేహం కనిపించింది.   ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు బాలిక మృతదేహాన్ని అదిలాబాద్ జిల్లా చెందిన ప్రభాకర్ కూతురిదిగా గుర్తించారు.

7 నెలల నుంచి ప్రభాకర్ ఫ్యామిలీతో సూరారంలో నివాసం ఉంటున్నాడు. అక్టోబర్  12న కూతురు జోష్న(7) కనిపించడం లేదని సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు . పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. ఈ క్రమంలో ఇవాళ  బాసరగడి గ్రామంలో గోనెసంచిలో బాలిక మృతదేహం కనిపించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బాలికను ఎవరు హత్య చేశారు..ఎందుకు హత్య చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.