
వంగూరు, వెలుగు: మండలంలో రూ. 70 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు జడ్పీటీసీ కేవీఎన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఎంపీడీవో ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు. కొండారెడ్డిపల్లి ఎక్స్ రోడ్ నుంచి పోల్కంపల్లి వరకు సెంట్రల్ లైటింగ్, సర్వారెడ్డిపల్లి నుంచి కొండారెడ్డిపల్లి వరకు ఫోర్ లేన్ రోడ్డు మంజూరైనట్లు చెప్పారు. మండలాన్ని సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వంశీకృష్ణ సహకారంతో డెవలప్ చేస్తామన్నారు. పండిత్రావు, పాండురంగారెడ్డి, అల్వాల్ రెడ్డి, రంగారావు, కడారి వెంకటయ్య యాదవ్ పాల్గొన్నారు.