7.28 కోట్ల ఐటీ రిటర్నులు దాఖలు

7.28 కోట్ల ఐటీ రిటర్నులు దాఖలు

న్యూఢిల్లీ :  2024–-25 అసెస్‌‌‌‌మెంట్ సంవత్సరం కోసం గత నెల 31 గడువు నాటికి 7.28 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్‌‌‌‌లు వచ్చాయని ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం వెల్లడించింది. గత ఏడాది 6.77 కోట్ల ఐటీఆర్​లు దాఖలయ్యాయి.  తాజాగా అందిన  మొత్తం 7.28 కోట్ల ఐటీఆర్‌‌‌‌లలో పాత పన్ను విధానంలో

2.01 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయి. కొత్త పన్ను విధానాన్ని 5.27 కోట్ల మంది ఎన్నుకున్నారు. జులై 31న ఒక్కరోజే 69.92 లక్షల ఐటీఆర్‌‌‌‌లు దాఖలయ్యాయి. ఈ ఏడాది డిసెంబరు 31 వరకు జరిమానాతో ఐటీఆర్​ను ఇవ్వవచ్చని ఐటీశాఖ తెలిపింది.