
కామారెడ్డిటౌన్, వెలుగు: కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 74 మంది సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు. అర్జీలను కలెక్టర్ ఆశిశ్సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఆయా శాఖల ఆఫీసర్లు వెంటనే పరిష్కరించాలన్నారు. జడ్పీ సీఈవో చందర్ నాయక్, డీఆర్డీవో సురేందర్, డీపీవో శ్రీనివాస్రావు, ఆఫీసర్లు పాల్గొన్నారు.