Trains Cancelled: హైదరాబాద్ టు న్యూఢిల్లీ 78 రైళ్లు రద్దు..36 దారి మళ్లించారు

Trains Cancelled: హైదరాబాద్ టు న్యూఢిల్లీ 78 రైళ్లు రద్దు..36 దారి మళ్లించారు

హైదరాబాద్- న్యూఢిల్లీ మధ్య  పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఈ రెండు నగరాల మధ్య మొత్తం 78 రైళ్ల రాకపోకలను రద్దు చేసింది. దీంతో పాటు 36 రైళ్లను దారి మళ్లిస్తోంది.  నేటి నుంచి ( జూన్ 27) నుంచి జూలై 7 వరకు ఈ రైళ్ల రాకపోకల రద్దు కొనసాగుతుంది. కాజీపేట, బలార్షా సెక్షన్ల మధ్య మూడో లైన్ నిర్మాణం  జరుగుతుండటంతో రైళ్లను రద్దు చేసింది దక్షిణహధ్య రైల్వే. 

సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని ఆసిఫాబాద్, రెచ్ని  స్టేషన్ల మధ్య కొత్తగా మూడో రైల్వే లైన్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఈ రైళ్ల రద్దు, దారి మళ్లింపు కొన సాగుతుందన్నారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. ఈ రూట్ లో రైల్వే నెట్ వర్క్ సామర్థ్యం పెంచడం వంటి మౌలిక సదుపాయాల ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు రైల్వే అధికారులు. 

రద్దు చేయబడిన రైళ్ల డిటెయిల్స్: 

  • రైలు నం. 17003: కాజీపేట్-సోలాపూర్ ఎక్స్‌ప్రెస్
  • రైలు నం. 17004: బల్హర్షా-కాజీపేట ఎక్స్‌ప్రెస్
  • రైలు నెం. 12757: సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్
  • రైలు నెం. 12758: సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్
  • రైలు నెం. 20805:విశాఖపట్నం-న్యూఢిల్లీ
  • రైలు నెం. 20806:న్యూ ఢిల్లీ-విశాఖపట్నం
  • రైలు నెం. 12803: విశాఖపట్నం-నిజాముద్దీన్
  • రైలు నెం. 12804: నిజాముద్దీన్-విశాఖపట్నం

దారి మళ్లించిన రైళ్ల వివరాలు 

  • రైలు నెం. 12590: సికింద్రాబాద్-గోరఖ్‌పూర్ (మజ్రీ, పింపాల్, ఖుతీ, ముద్ఖేడ్ , నిజామాబాద్ మీదుగా మళ్లించబడింది)
  • రైలు నం. 12589: గోరఖ్‌పూర్-సికింద్రాబాద్ (మజ్రీ, పింపాల్, ఖుతీ, ముద్ఖేడ్ , నిజామాబాద్ మీదుగా మళ్లించబడింది)
  • రైలు నెం. 12723: సికింద్రాబాద్-న్యూ ఢిల్లీ (మజ్రీ, పింపాల్, ఖుతీ, ముద్ఖేడ్ , నిజామాబాద్ మీదుగా మళ్లించబడింది)
  • రైలు నెం. 12724: న్యూఢిల్లీ-సికింద్రాబాద్ (మజ్రీ, పింపాల్, ఖుతీ, ముద్ఖేడ్ , నిజామాబాద్ మీదుగా మళ్లించబడింది)
  • రైలు నెం. 12723: హైదరాబాద్-న్యూ ఢిల్లీ (నిర్దిష్ట రోజుల్లో ఒక గంట రీషెడ్యూల్ చేయబడింది)
  • రైలు నం. 12724: న్యూఢిల్లీ-హైదరాబాద్ (నిర్దిష్ట రోజుల్లో రెండు గంటలు రీషెడ్యూల్ చేయబడింది)
  • రైలు నం. 12791: సికింద్రాబాద్-దానాపూర్ (జూలై 4 నుండి 6 వరకు 75 నిమిషాలు రీషెడ్యూల్ చేయబడింది)