యువతితో సైబర్​ వల.. రూ.7.27లక్షల మోసం

యువతితో సైబర్​ వల.. రూ.7.27లక్షల మోసం

బషీర్ బాగ్, వెలుగు: యువతితో వల వేసి సైబర్​నేరగాళ్లు ఓ ప్రైవేట్​ఉద్యోగి నుంచి రూ.7.27లక్షలు కొట్టేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. సిటీకి చెందిన ప్రైవేట్ ఉద్యోగి(45)కి ఇటీవల ఓ యువతి కాల్​చేసింది. తర్వాత వాట్సాప్​లో చాట్​చేస్తూ దగ్గరయ్యింది. స్టాక్స్​లో ఇన్వెస్ట్​చేస్తే అధిక మొత్తంలో లాభాలు వస్తాయంటూ నమ్మబలికింది.

ఓ ఫ్రాడ్​వెబ్​సైట్​లో ఇన్వెస్ట్​చేయించింది. డాలర్స్​లో లాభాలు చూపించింది. వాటిని డ్రా చేసేందుకు ట్యాక్స్, ఎక్స్​చేంజ్​పేరిట కొంత చెల్లించేలా చేసింది. అలా రూ.7,27,400 కట్టించింది. చివరికి తాను సైబర్​నేరగాళ్ల వలలో పడ్డానని తెలుసుకున్న బాధితుడు 
పోలీసులను ఆశ్రయించాడు.