ఛత్తీస్‎గఢ్‎లో తీవ్ర విషాదం.. పిడుగుపాటుకు 8 మంది మృతి

ఛత్తీస్‎గఢ్‎లో తీవ్ర విషాదం.. పిడుగుపాటుకు 8 మంది మృతి

ఛత్తీస్ గఢ్‎లో వర్షం తీవ్ర విషాదం నింపింది. రాజ్ నందన్‎గాన్ జిల్లాలో ఇవాళ (సెప్టెంబర్ 23) కురిసిన భారీ వర్షానికి పిడుగు పడి ఎనిమిది మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ఘటన స్థలంలో సహయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భారీ వర్షం కురుస్తోన్న నేపథ్యంలో ప్రజలు ఎవరూ ఇండ్ల నుండి బయటకు రావొద్దని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే టోల్ ఫ్రీ నెంబర్‎కు కాల్ చేసి అధికారులకు తెలియజేయాలని సూచించారు. కాగా, పిడుగు పాటుకు మృతి చెందిన వారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ALSO READ | అమెరికాలో కాల్పులు నలుగురు మృతి