
- మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వెల్లడి
- ప్లాంట్ భూమి పూజ కోసం అధికారులతో ఏర్పాట్ల పరిశీలన
కోల్ బెల్ట్/జైపూర్,వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి వద్ద సింగరేణి థర్మల్పవర్ ప్లాంట్ ఆవరణలో మరో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్పవర్ప్లాంట్(ఎస్టీపీపీ) ఏర్పాటులో భాగంగా భూమిపూజకు అవసరమైన ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు.
800 మెగావాట్ల పవర్ ప్లాంట్ను రూ.9.500 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. త్వరలో రాష్ట్ర ప్రముఖులతో ప్రారంభించేందుకు రెడీగా ఉండాలని ఆఫీసర్లను ఆదేశించారు. మరోవైపు హడావుడిగా ఎస్టీపీపీలో మూడో ప్లాంట్నిర్మాణానికి భూమి పూజకు అవసరమైన ఏర్పాట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం సీఎం రేవంత్రెడ్డి లేదా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో వస్తారనే ప్రచారం కూడా జరిగింది.
అధికారికంగా రాష్ట్ర సర్కార్నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఎస్టీపీపీలో వివిధ శాఖ ఆఫీసర్లు, సిబ్బంది భూమిపూజకు ముందస్తు ఏర్పాట్లు చేయడాన్ని కలెక్టర్పరిశీలించారు. ఇటీవల మూడో ప్లాంట్ నిర్మాణ పనులు దక్కించుకున్న బీహెచ్ఈఎల్ కంపెనీతో సింగరేణి ఒప్పందం చేసుకుంది. నెల రోజుల్లో పనులు ప్రారంభిస్తామని నిర్మాణ కంపెనీ తెలిపింది.
అడిషనల్ కలెక్టర్ మోతీలాల్, సింగరేణి థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఇన్చార్జ్ జీఎం శ్రీనివాసులు, శ్రీరాంపూర్ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ రావు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, జైపూర్తహసీల్దార్వనజారెడ్డి ఉన్నారు.