బెజవాడలో గంజాయి కలకలం.. 808 కిలోల మత్తుపదార్దాలు సీజ్​

బెజవాడలో గంజాయి కలకలం.. 808 కిలోల మత్తుపదార్దాలు సీజ్​

ఆంధ్రప్రదేశ్​లో గంజాయి కలకలం రేగింది. విజయవాడలో మత్తు దొంగల మత్తును పోలీసులు వదిలించారు.  కృష్ణవరం టోల్​ ప్లాజా దగ్గర సోమవారం ( అక్టోబర్​ 7)  పోలీసులు వాహనాలు తనిఖీ  చేస్తున్న సమయంలో  రెండు వాహనాల్లో భారీగా గంజాయిని పట్టుకున్నారు.  రూ. 1.61 కోట్ల విలువైన 808 కిలోల మత్తు పదార్ధాలను అధికారులు సీజ్​ చేసి ముగ్గురిని అరెస్ట్​ చేశారు.  రెండు నెలల క్రితం విజయవాడలోని పలు పోలీస్​ స్టేషన్లలో 15 మంది గంజాయి దొంగలను పట్టుకున్నారు.