
ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 20 నుంచి డిసెంబర్ 10 వరకు అప్లైచేసుకోవచ్చు.
ఖాళీలు: 8500
తెలంగాణ: 460(ఆదిలాబాద్–10, భద్రాద్రి కొత్త గూడెం–21, జగిత్యాల–9, జనగామ–10, జయశంకర్ భూపాలపల్లి–12, జోగులాంబ గద్వాల–9, కామారెడ్డి–16, కరీంనగర్–14, ఖమ్మం–24, కుమ్రంభీం ఆసిఫాబాద్–7, మహబూబాబాద్–12, మహబూబ్నగర్–33, మేడ్చల్ మల్కాజిగిరి–5, మంచిర్యాల–8, మెదక్–14, నాగర్కర్నూల్–15, నల్గొండ–22, నిర్మల్–11, నిజామాబాద్–39, పెద్దపల్లి–10, రంగారెడ్డి–22, సంగారెడ్డి–20, సిద్దిపేట–17, రాజన్న సిరిసిల్ల–6, సూర్యాపేట–28, వికారాబాద్–23, వనపర్తి–12, వరంగల్–4, వరంగల్ రూరల్–11, యాదాద్రి భువనగిరి–16) ఆంధ్రప్రదేశ్: 620
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్లైన్ రాత పరీక్ష
ఆన్లైన్ రాత పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. ఎగ్జామ్ డ్యూరేషన్ 60 నిమిషాలు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి వన్ ఫోర్త్ మార్క్ కోత విధిస్తారు. పరీక్ష ఇంగ్లిష్, హిందీ రెండు భాషల్లో ఉంటుంది. అభ్యర్థులు బ్యాంక్ కేటాయించిన కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.
ఎగ్జామ్ సెంటర్స్: తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
లోకల్ లాంగ్వేజ్ టెస్ట్
రాష్ట్రాల వారీగా నోటిఫికేషన్లో అభ్యర్థులు ఎంచుకున్న లోకల్ లాంగ్వేజ్ ను టెస్ట్ చేస్తారు. చదవడం, రాయడం, మాట్లాడటం మూడు భాషా నైపుణ్యాలు పరీక్షస్తారు. అయితే ఆన్లైన్ రాత పరీక్షలో అర్హత మార్కులు సాధించిన వారికే ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఫైనల్గా ఎంపికైన అభ్యర్థులకు మెడికల్ ఫిట్నెస్ చూస్తారు.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
వయసు: అక్టోబరు 31, 2020 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
అప్రెంటిస్ డ్యూరేషన్: 3 ఏళ్లు
స్టైఫండ్: మొదటి ఏడాది నెలకు రూ.15000, రెండో ఏడాది రూ. 16,500, మూడో ఏడాది రూ.19000
దరఖాస్తులు: ఆన్లైన్లో..
ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు ఫీజు లేదు
హాల్టికెట్లకు: డిసెంబరు, 2020 చివరి వారం
ఎగ్జామ్ తేది: జనవరి 2021
దరఖాస్తులు ప్రారంభం: 20 నవంబర్ 2020
చివరి తేది: 10 డిసెంబర్ 2020
వెబ్సైట్: ncdcindia.org/apprenticeship