బస్వాపూర్​లో తొమ్మిది ఇండ్లల్లో చోరీ

బస్వాపూర్​లో తొమ్మిది ఇండ్లల్లో చోరీ

భిక్కనూరు ( కామారెడ్డి)​, వెలుగు : మండలంలోని బస్వాపూర్​లో తాళాలు వేసిన తొమ్మిది ఇండ్లల్లో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. స్థానికుల వివరాల  ప్రకారం..  కొందరు గుర్తుతెలియని దుండగులు  గ్రామంలోని సీసీ కెమెరాల వైర్లను కట్ చేసి  కట్ చేసి, డాకి రమేశ్ ఇంటి తాళం పగుల గొట్టి బీరువాలోని 3 తులాల బంగారు అభరణాలు, రూ. 40 వేల నగదు,  వెండి వస్తువులు, నాగమణి ఇంట్లో  3 తులాల బంగారు వస్తువులు చోరీ చేశారు.

మామిడి సత్తమ్మ, సువర్ణ, ధర్మరాజు,  చంద్రయ్య, స్వామి, ఇండ్లలో కూడా చోరీ జరిగింది.  శుక్రవారం భిక్కనూరు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జిల్లా కేంద్రం నుంచి క్లూస్​ టీమ్స్​ రప్పించి  ఫింగర్ ఫ్రింట్స్ సేకరించారు. తొమ్మిది ఇండ్లల్లో దాదాపు 15 తులాల  బంగారు అభరణాలు , కొంత నగదు చోరీ అయినట్లు పోలీసులు తెలిపారు.