![సర్టిఫికెట్లను సరెండర్ చేసిన 9 ఎన్బీఎఫ్సీలు](https://static.v6velugu.com/uploads/2024/07/9-nbfcs-who-surrendered-their-certificates_TwemdgbK10.jpg)
ముంబై: ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్తో సహా తొమ్మిది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు తమ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (సిఓఆర్)ను సెంట్రల్ బ్యాంక్కు సరెండర్ చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం తెలిపింది. వీటిలో, ఐదు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు బ్యాంకింగేతర, ఆర్థిక సంస్థల వ్యాపారం నుంచి బయటికి రావడంతో సీఓఆర్ను వెనక్కి ఇచ్చేశాయి.
ఈ ఎన్బీఎఫ్సీల్లో విగ్ఫిన్ హోల్డింగ్స్, స్ట్రిప్ కమోడియల్, అల్లియం ఫైనాన్స్, ఎటర్నైట్ ఫిన్వెస్ట్, ఫినో ఫైనాన్స్ ఉన్నాయి. అలెగ్రో హోల్డింగ్స్, టెంపుల్ ట్రీస్ ఇంపెక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్, హెమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే మూడు ఎన్బీఎఫ్సీలు రిజిస్ట్రేషన్ అవసరం లేని, రిజిస్టర్ చేయని కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ (సిఐసి)కి నిర్దేశించిన ప్రమాణాలను పాటించిన తర్వాత తమ సర్టిఫికెట్లను సరెండర్ చేశాయని బ్యాంక్ తెలిపింది. ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ సమ్మేళనం కారణంగా చట్టపరమైన సంస్థగా మిగిలిపోయినందున సీఓఆర్ను సరెండర్ చేసింది.